సాయి రోనక్, ప్రగ్యా నగ్రా జంటగా రాజేంద్ర ప్రసాద్, రోహిణి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకుడు. వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. ఈనెల 25న సినిమా విడుదల. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘ఇది ఒక తండ్రీ కూతుళ్ల కథ. నేను గతంలో నటించిన ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రమేష్ చెప్పాల రచయితగా పనిచేశాడు. అప్పటినుంచి తనతో అనుబంధం ఉంది. ఇందులో తెలంగాణ బిడ్డగా నటించడం నా అదృష్టం.
కంటెంట్పై ఉన్న నమ్మకంతో రిలీజ్కు ముందే నిర్మాతకు కంగ్రాట్స్ చెబుతున్నా’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘తెలంగాణ నేపథ్యంలో ఓ బలమైన కథ చెప్పాలని, అది అందరి కథ అవ్వాలని దీన్ని తెరకెక్కించా. అరిటాకులో వడ్డించిన విందు భోజనంలా ఉంటుంది’ అని చెప్పాడు. ఈ సినిమా ద్వారా ఒక మంచి సందేశాన్ని అందంగా చెప్పాం అని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. హీరోహీరోయిన్స్తో పాటు నటులు సప్తగిరి, కృష్ణుడు, వడ్లమాని శ్రీనివాస్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాల్గొన్నారు.