500కిపైగా థియేటర్స్‌‌‌‌లో ఆదిపర్వం మూవీ

500కిపైగా థియేటర్స్‌‌‌‌లో ఆదిపర్వం మూవీ

మంచు లక్ష్మి లీడ్ రోల్‌‌‌‌లో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపర్వం’.   రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్,  ఎ.ఐ (అమెరికా ఇండియా) ఎంటర్టైన్మెంట్స్ కలిసి  నిర్మించాయి. అక్టోబర్  31న 500కి పైగా థియేటర్స్‌‌‌‌లో ఈ  చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. 1974 – 1990 మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని  రూపొందించారు.  ఇందులో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.