మంచు లక్ష్మి లీడ్ రోల్లో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపర్వం’. రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ (అమెరికా ఇండియా) ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించాయి. అక్టోబర్ 31న 500కి పైగా థియేటర్స్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. 1974 – 1990 మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.