ఢిల్లీ అపోలో హాస్పిటల్లో చేరిన ఎల్‌కే అద్వానీ

ఢిల్లీ అపోలో హాస్పిటల్లో చేరిన ఎల్‌కే అద్వానీ

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో న్యూఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మథుర రోడ్‌లో ఉన్న అపోలో హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ వార్డుకు ఆయన్ని తరలించారు. కొన్ని రోజుల క్రితమే ఆయన ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. 

యూరాలజీ, వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో అద్వానీ బాధపడుతున్నట్లు గతంలో హాస్పిటల్ లో చేరినప్పుడు వైద్యులు చెప్పారు. అద్వానీ డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి ఓ ప్రకటనలో తెలిపింది.