మోదీ సర్కార్ ఆగస్టులోగా పడిపోతుంది : లాలూ ప్రసాద్

మోదీ సర్కార్ ఆగస్టులోగా పడిపోతుంది : లాలూ ప్రసాద్

పాట్నా: బిహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్  లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) ప్రభుత్వం ఆగస్టు నాటికి పడిపోవచ్చని అన్నారు. లోక్‌‌‌‌‌‌‌‌సభకు మధ్యంతర ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని..కాబట్టి అందరూ సిద్ధంగా ఉండాలని తన పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆర్జేడీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో లాలూ మాట్లాడారు.

'మోదీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. ఆగస్టు నాటికి అది కూలిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు. పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ సీట్ల సంఖ్యను, ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది. బిహార్ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్నాం. మేం ఎప్పుడూ సిద్ధాంతాల విషయంలో రాజీపడలేదు" అని లాలు పేర్కొన్నారు.