
- 271 ఎకరాలు.. 300 నిర్మాణాలు
- త్వరలోనే ‘ఎలివేటెడ్ కారిడార్’కు భూసేకరణ
- ఇప్పటికే డిఫెన్స్, కంటోన్మెంట్ భూముల లైన్ క్లియర్
- భూములు, ఇండ్లు కోల్పోయే వారికి రూ.130 కోట్ల పరిహారం
- రోడ్డుకు ఇరువైపులా 200 మీటర్లు కూల్చివేతలకు రంగం సిద్ధం!
హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎలివేటెడ్కారిడార్ప్రాజెక్టు భూసేకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్యారడైజ్నుంచి బోయిన్పల్లి, జేబీఎస్నుంచి శామీర్పేట వరకు నిర్మించనున్న ఈ రెండు ప్రాజెక్టుల కోసం మొత్తం 271 ఎకరాలు సేకరించాలని హెచ్ఎండీఏ లక్ష్యంగా పెట్టుకున్నది. రెండు రూట్లలో రోడ్డుకు రెండువైపులా 200 మీటర్ల మేరకు ఉన్న 300 ప్రైవేట్నిర్మాణాలను గుర్తించింది. వీటి యజమానులకు నోటీసులు కూడా ఇచ్చింది. త్వరలోనే ఓనర్లకు పరిహారం అందజేసి కూల్చివేతలు కూడా చేపట్టబోతున్నది. వీటి కోసం రూ.130 కోట్ల పరిహారం అవసరముంటుందని అంచనా వేసింది.
కంటోన్మెంట్లో లైన్ క్లియర్
ఎలివేటెడ్కారిడార్ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంటోన్మెంట్లో భూముల సేకరణకు లైన్క్లియర్అయ్యింది. రక్షణశాఖకు సంబంధించిన భూములుండడంతో వాటికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ప్రైవేట్బిల్డింగులు, భూములు కోల్పోయే వారికి ముందు ట్రాన్స్ఫర్ఆఫ్ డెవలప్మెంట్రైట్స్(టీడీఆర్) వర్తింపచేయాలని హెచ్ఎండీఏ అనుకుంది.
అయితే, మెజారిటీ నిర్వాసితులు పరిహారాన్నే కోరుకుంటుండడంతో వారనుకున్నట్టు డబ్బులే ఇచ్చేందుకు హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణానికి మిలిటరీ ఎస్టేట్ భూములు, సికింద్రాబాద్కంటోన్మెంట్బోర్డు భూములు ఇవ్వడానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రాజెక్టు స్వరూపం ఇలా..
సికింద్రాబాద్ప్యారడైజ్నుంచి బోయిన్పల్లి డెయిరీ ఫామ్ రోడ్వరకూ 5.32 కి.మీ. మేరకు డబుల్డెక్కర్ఎలివేటెడ్కారిడార్నిర్మించనున్నారు. దీని ఖర్చు రూ.1580 కోట్లు కాగా, 74 ఎకరాలను సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో డిఫెన్స్భూములు 65 ఎకరాలు, ప్రైవేట్ భూములు 9 ఎకరాలున్నాయి. జేబీఎస్నుంచి హకీంపేట మీదుగా శామీర్పేట ఓఆర్ఆర్ను కలిపే ఎలివేటెడ్ కారిడార్ను రూ.2232 కోట్లతో నిర్మిస్తున్నారు.
18.12 కి.మీ. మేర నిర్మించే ఈ ప్రాజెక్టుకు 197 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో 113 ఎకరాలు డిఫెన్స్భూములు కాగా, మరో 84 ఎకరాలు ప్రైవేట్భూములున్నాయి. ఇందులో డిఫెన్స్, కంటోన్మెంట్భూముల సమస్య పరిష్కారమైంది. దీంతో ప్రైవేట్భూముల్లో ఉన్న 300 ప్రైవేట్నిర్మాణాలను గుర్తించగా, డబుల్డెక్కర్ కారిడార్లోనే 200 పైగా నిర్మాణాలున్నాయి.
ట్రాఫిక్కు చెక్
ఎలివేటెడ్కారిడార్ల నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎన్హెచ్–44 రోడ్లో మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్రూట్లలో వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయంటున్నారు. అలాగే జేబీఎస్నుంచి శామీర్పేట వరకూ నిర్మించే కారిడార్ వల్ల జేబీఎస్నుంచి నేరుగా శామీర్పేట్కు ఎలాంటి ట్రాఫిక్సిగ్నల్స్లేకుండా వెళ్లవచ్చంటున్నారు.
దీనివల్ల గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్, రామగుండం, మంచిర్యాల వెళ్లేవారికి సమయభావం తగ్గుతుందంటున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తిరుమలగిరి, ఆల్వాల్జంక్షన్ల వద్ద ర్యాంపులు నిర్మిస్తుండడంతో అక్కడి నుంచి కూడా నేరుగా ఫ్లైఓవర్ఎక్కి వెళ్లే ఛాన్స్ఉంటుంది. దీనివల్ల ఆ ప్రాంతంలోని ప్రజలకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి.