- 1,300 గ్రాముల ‘మాల్’ పట్టివేత
హైదరాబాద్ సిటీ, వెలుగు: డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ను హైదరాబాద్ నార్కోటిక్స్, ఎన్ఫోర్స్మెంట్వింగ్, లంగర్ హౌస్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.60 కోట్ల విలువైన 1,300 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన ఒలీవర్ అలియాస్జాన్సన్2009 లో బిజినెస్ వీసాపై న్యూఢిల్లీకి వచ్చాడు. క్లాత్స్, కాస్మోటిక్స్బిజినెస్చేసేవాడు. వచ్చే సంపాదన సరిపోకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచించాడు. తోటి నైజీరియన్స్డ్రగ్స్దందా చేస్తూ లగ్జరీ లైఫ్అనుభవిస్తుండడాన్ని చూసి అతడు కూడా బిజినెస్లోకి దిగాడు. 2013లో పాస్పోర్ట్గడువు ముగిసింది. అయినా దేశం విడిచి వెళ్లలేదు.
2013లో హెరాయిన్తో ఢిల్లీ పోలీసులకు చిక్కి ఆరేండ్లు జైలులో గడిపాడు. బయటకు వచ్చాక ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చి మళ్లీ డ్రగ్స్అమ్మడం మొదలుపెట్టాడు. తర్వాత బెంగళూరుకు డ్రగ్స్దందాను విస్తరించాడు. నైజీరియాకు చెందిన ఒయీబో దగ్గర గ్రాముకు రూ.300 చొప్పున కిలో, రెండు కిలోలు డ్రగ్స్కొని ముంబై, హైదరాబాద్, బెంగళూరులో రూ.600 నుంచి వెయ్యి వరకు అమ్ముతున్నాడు. కొద్ది రోజుల కింద ఒయీబో 1,300 గ్రాముల ఎండీఎంఏ ఇచ్చి హైదరాబాద్లో అమ్మాలని పంపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లంగర్హౌస్లో పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్విలువ రూ.1.60 కోట్లు ఉంటుందని తెలిపారు.