![మెదక్ చర్చిలో భక్తుల సందడి](https://static.v6velugu.com/uploads/2024/07/large-number-of-devotees-flocked-to-medak-church_aduKUk7zDw.jpg)
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా సీఎస్ఐ ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య దైవసందేశాన్ని అందించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక వంటి దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం చర్చి ఆవరణలో చెట్ల కింద వంటలు చేసుకొని ఆనందంగా గడిపారు.