న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) తన బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీస్ (బీఅండ్ఎఫ్) వర్టికల్కు పలు ఆర్డర్లను పొందినట్లు మంగళవారం తెలిపింది. హైదరాబాద్, ముంబైలోని క్లయింట్ల నుంచి ఆర్డర్లు వచ్చినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్డర్ల విలువను కంపెనీ వెల్లడించలేదు. అయితే, దాని ప్రాజెక్ట్ వర్గీకరణ ప్రకారం, ముఖ్యమైన ఆర్డర్ల విలువ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
లార్సెన్ అండ్ టూబ్రో అనేది ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) ప్రాజెక్ట్లు, హైటెక్ తయారీ సేవలు అందించే 27 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ బహుళజాతి సంస్థ.