![కుమ్మరిగూడలో లాస్య నందిత ప్రచారం](https://static.v6velugu.com/uploads/2023/11/lasya-nandita-campaign-in-kummariguda-in-telangana-election_WhMNlGCuxF.jpg)
కంటోన్మెంట్, వెలుగు: తనను గెలిపిస్తే.. కంటోన్మెంట్ సెగ్మెంట్ను రాష్ట్రంలోనే నంబర్వన్గా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత తెలిపారు. ఇతర పార్టీల విష ప్రచారాలను నమ్మొద్దన్నారు. గురువారం కంటోన్మెంట్ పరిధిలోని 150వ డివిజన్లో లాస్య నందిత ప్రచారం చేశారు. కుమ్మరిగూడ వెల్ఫేర్, రెసిడెన్షియల్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై ఓట్లను అభ్యర్థించారు. తనను గెలిపిస్తే.. పెండింగ్ పనులను పూర్తిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కుమ్మరి గూడ వాసుల నుంచి లాస్య నందితకు మద్దతు దక్కింది. ఆమెను గెలిపించుకుంటామని వారు తెలిపారు. కంటోన్మెంట్లోని మాల సంఘం ప్రతినిధులు లాస్య నందితను కలిసి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న సతీమణి గీతమ్మ, మాల సంఘం ప్రతినిధులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Also read :- కాంగ్రెస్ రాగానే రూ.2 లక్షల రుణమాఫీ : బాన్సువాడ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి