Sahithi Infra Case: సాహితీ ఇన్ఫ్రాలో భూములు కొనుగోలు చేసిన వారిపై ఈడీ నిఘా

Sahithi Infra Case: సాహితీ ఇన్ఫ్రాలో భూములు కొనుగోలు చేసిన వారిపై ఈడీ నిఘా

హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రాలో భూములు కొనుగోలు చేసిన వారిపై ఈడీ నిఘా పెట్టింది. వైద్య పరీక్షల అనంతరం సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఈడీ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో లక్ష్మీ నారాయణ నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నారు. సాహితీ ఇన్ఫ్రా రికార్డులను ఈడీ పరిశీలించింది. గతంలోనే సాహితీ ఇన్ఫ్రాపై ఈడీ సోదాలు జరిగాయి. సాహితీకి సంబంధించిన ప్రాజెక్టులలో నగదు బదిలీపై ఈడీ ఆరా తీసింది.

లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. మరికొన్ని అరెస్ట్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సాహితీ ఇన్ఫ్రా పెట్టుబడుల సొమ్మును ఎక్కడకు తరలించారనే దానిపై ఆరా తీసిన ఈడీ, సాహితీ ఇన్ఫ్రా పేరుతో అనేక మోసాలకు పాల్పడినట్లు గుర్తించింది. సాహితీ ఇన్ ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం విచారణకు పిలిచి రాత్రి వరకు ప్రశ్నించింది.

 

సంగారెడ్డి జిల్లా అమీన్‌‌పూర్‌‌లో సాహితీ రియల్ ఎస్టేట్ ప్రీ-లాంచింగ్ పేరుతో ఆయన మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే రూ.260 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు హైదరాబాద్ సీసీఎస్​లో కేసు నమోదైంది. రూ.126 కోట్లు దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి.

ఈ వ్యవహారంలో సీసీఎస్ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రూ. 161 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దర్యాప్తులో భాగంగా లక్ష్మీనారాయణను శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు విచారించింది. ఈడీ అధికారులకు సరైన ఆధారాలు ఇవ్వకపోవడంతో పాటు విచారణకు సహకరించక పోవడంతో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.