
హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీహెచ్) స్పెషల్ చానెల్ ఆఫ్ అడ్మిషన్ పోర్టల్ ప్రారంభించింది. జేఈఈ మెయిన్ లేకుండానే టాలెంట్ ఉన్న స్టూడెంట్స్కు ఇంటర్ అర్హతతో రెండు బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తోంది. అర్హులైన స్టూడెంట్స్ సబ్జెక్ట్ ప్రొఫీషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూలో మెరిట్ సాధించి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో బీటెక్ చేయొచ్చు.
బీటెక్ ప్రోగ్రామ్స్: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్(ఈసీఈ), కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ)
సీట్లు: ఒక్కో ప్రోగ్రామ్లో 10 సీట్లు ఉంటాయి.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో జులై 2021 నాటికి ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు సీబీఎస్ఈ ఉడాన్ స్కీమ్ క్వాలిఫై అయి ఉండాలి/జవహర్ నవోదయలో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి/ టెన్త్ తర్వాత ఇంటిగ్రేటెడ్ బీటెక్లో ఫోర్త్ సెమిస్టర్లో ఎన్రోలై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులకు 60 నిమిషాలకు కంప్యూటర్ బేస్డ్ సబ్జెక్ట్ ప్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలిచి మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కేటాయిస్తారు.
సిలబస్: ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు సీబీఎస్ఈతోపాటు స్టేట్ సిలబస్ చదువుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్లైన్లో
అప్లికేషన్ పోర్టల్ క్లోజింగ్ తేది: మే 10
ఎగ్జామ్ తేది: జూన్ 2
అప్లికేషన్ ఫీజు: రూ.500
వెబ్సైట్: ugadmissions.iiit.ac.in