
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ , లావణ్య కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. ఈ మధ్య ఈ కేసు విషయంలో ఎలాంటి హడావిడి లేకపోయినా..ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషనుకు లావణ్య వెళ్లడంతో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులు .. వారి అనుచరులపై ఫిర్యాదు చేసింది. రాత్రి సమయంలో కొంతమంది తన ఇంటి కి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read:-పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..చెలరేగిన మంటలు
రాజ్ తరుణ్.. అతడి తల్లిదండ్రులపై తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయడం లేదని లావణ్య ఆరోపిస్తుంది. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని.. తనకు పోలీసులు న్యాయం చేయకపోతే స్టేషన్ ఎదుటే ప్రాణాలు విడుస్తానని చెబుతుంది లావణ్య.లావణ్య ఉంటున్న రాజ్ తరుణ్ ఇంటిని ఆమె వదిలి వెళ్లాలని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. అయితే ఈ విషయంలో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తనమీద 15 మందితో కలిసి ఒకేసారి దాడికి దిగారని లావణ్య ఆరోపించింది. తాజాగా ఇదే విషయంపై కంప్లయింట్ ఇవ్వడానికి హైదరాబాద్లోని నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.