సంబరాల ఏటిగట్టు సినిమాలో వెయ్యి మంది డ్యాన్సర్స్‌‌‌‌‌‌‌‌తో..లావిష్ సాంగ్

సంబరాల ఏటిగట్టు సినిమాలో వెయ్యి మంది డ్యాన్సర్స్‌‌‌‌‌‌‌‌తో..లావిష్ సాంగ్

సాయి దుర్గ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఎస్‌‌‌‌‌‌‌‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ‘హనుమాన్‌‌‌‌‌‌‌‌’ ప్రొడ్యూసర్స్‌‌‌‌‌‌‌‌ కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి  నిర్మిస్తున్నారు. తేజ్ యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్‌‌‌‌‌‌‌‌ని ఓ భారీ సెట్‌‌‌‌‌‌‌‌లో చిత్రీకరించారు. ప్రేక్షకులకు ఇది గ్రేట్ సినిమాటిక్ ఎక్స్​పీరియన్స్ అందించబోతోందని మేకర్స్ చెబుతున్నారు. 

ప్రస్తుతం ఓ లావిష్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌ జరుగుతోంది. వెయ్యి మంది డ్యాన్సర్స్‌‌‌‌‌‌‌‌తో దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఐశ్వర్యలక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. బి అజనీష్ లోక్‌‌‌‌‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. వెట్రివేల్ పళనిసామి డీవోపీ కాగ నవీన్ విజయకృష్ణ ఎడిటర్. ఈ ఏడాది సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుంది.