చాకలి ఐలమ్మ వర్శిటీలో చదివిన ప్రతి బిడ్డ ప్రపంచ స్థాయిలో రాణించాలి : సీఎం రేవంత్ రెడ్డి

చాకలి  ఐలమ్మ వర్శిటీలో చదివిన ప్రతి బిడ్డ ప్రపంచ స్థాయిలో రాణించాలి : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీకి వందేళ్ల చరిత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ఈ వర్శిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గొప్ప కీర్తి అని అన్నారు.  చాకలి ఐలమ్మ మహిళా వర్శిటీలో పలు నూతన  భవనాలకు మార్చి 8న  శంకుస్థాపన చేశారు రేవంత్ . ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  వర్శిటీ అభివృద్ధి పనులకు రూ. 500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.  ఈ యూనివర్శిటీ అంతర్జాతీయ యూనివర్శిటీలతో పోటీ పడాలన్నారు.  ఇక్కడ చదివిన  ప్రతి  ఆడబిడ్డ  ప్రపంచ స్థాయిలో రాణించాలన్నారు. రెండున్నరేళ్లలో  వర్శిటీ నిర్మాణం పూర్తవుతుందన్నారు. వర్శిటీ నిర్మాణానికి నిధుల ఢోకా ఉండదన్నారు రేవంత్ .

ALSO READ | అఖిల పక్షానికి కమలం, కారు దూరం.. హాట్ టాపిక్‎గా రెండు పార్టీల తీరు

అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తారని అన్నారు రేవంత్.  రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహిళలకు  33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్.  మహిళలకు ఏ పాత్ర ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తారని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. తాము  అధికారంలోకి వచ్చాక మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ  అవకాశం కల్పించామన్నారు. అదానీ అంబానీలతో పోటీపడేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.