ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు

ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన సంబురాలు

నెట్​వర్క్, వెలుగు: ఆదిలాబాద్ ​పార్లమెంట్​స్థానంలో గొడం గనేశ్, పెద్దపల్లి స్థానంలో వంశీకృష్ణ విజయం సాధించడంతో ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్​ నేతలు సంబురాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్​ నేత గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో సాధించడంతో మంచిర్యాల జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో  నేతలు, కార్యకర్తలు డ్యాన్సులతో హుషారెత్తించారు. 

పటాకులు పేల్చి, రంగులు చల్లుకుని సంతోషాన్ని పంచుకున్నారు. సోనియా, రాహుల్​గాంధీ, వివేక్​ వెంకటస్వామి, గడ్డం వినోద్, వంశీకృష్ణకు జేజేలు పలికారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే వివేక్​ ఇంటి వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి అభినందలు తెలిపారు. వారి ఇంటి వద్ద సాయంత్రం లీడర్లు, కార్యకర్తలు డ్యాన్సులు చేస్తూ సంబరాల్లో మునిగితేలారు. వేడుకల్లో వివేక్, వంశీకృష్ణ సైతం డ్యాన్స్​ చేశారు.