సీఎంని కలిసిన ముదిరాజ్​ నాయకులు

సీఎంని కలిసిన ముదిరాజ్​ నాయకులు

చేర్యాల, వెలుగు: తెలంగాణ ముదిరాజ్​ సంఘం జేఏసీ జనరల్​సెక్రటరీ భీమా లక్ష్మణ్​ ఆధ్వర్యంలో శుక్రవారం పలువురు ముదిరాజ్​ నాయకులు సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్​సమస్యలు  పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. స్పందించిన సీఎం ముదిరాజ్​లకు కాంగ్రెస్​ ప్రభుత్వం అండగా ఉంటుందని, పార్లమెంట్​ ఎన్నికల తర్వాత నామినేటెడ్​ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు భీమా లక్ష్మణ్​ తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్​ లక్ష్మీనారాయణ, వైస్​ చైర్మన్​ సుధాకర్,​ మహిళా కన్వీనర్​ పుష్పలత పాల్గొన్నారు.