పాకిస్తాన్​ కు షాక్​ ఇచ్చిన ఇండియా.. 48 గంటల్లో పాక్​ పౌరులు ఇండియా వదిలి వెళ్లాల్సిందే

పాకిస్తాన్​ కు షాక్​ ఇచ్చిన ఇండియా.. 48 గంటల్లో  పాక్​ పౌరులు ఇండియా వదిలి వెళ్లాల్సిందే

పహల్గామ్​ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్​కు భారత్​ షాక్​ఇచ్చింది.  భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. 48గంటల్లో పాక్​ పర్యాటకులు.. ఇండియాలో ఉంటున్న పాక్​ పౌరులు ఇండియాను వదలి వెళ్లాలని పాక్​ హైకమిషన్​ ఆదేశాలు జారీ చేసింది.  పాకిస్తాన్​ దేశీయులను భారత్​లోకి అనుమతించమని తేల్చి చెప్పింది భారత ప్రభుత్వం.   ఇండియా... పాకిస్తాన్​ మధ్య సింధు జలాల మధ్య ఒప్పందాన్ని నిలిపివేసింది.  పహల్గామ్​ దాడి వెనుక పాకిస్తాన్​ హస్తం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  అటారీ వాఘా సరిహద్దు చెక్​ పోస్ట్​ ను  మూసివేశారు.  

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో సాధారణ టూరిస్టులను టార్గెట్ చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు తామే పాల్పడినట్లుగా పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి.