నేను బీఆర్ఎస్​చైర్మన్‌ను కాదు : శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నేను బీఆర్ఎస్​చైర్మన్‌ను కాదు : శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

హైదరాబాద్: శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో చీఫ్‌ విప్‌గా పట్నం మహేందర్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా సుఖేందర్‌రెడ్డి  మీడియాతో చిట్​చాట్ చేశారు. తాను బీఆర్‌ఎస్‌ మండలి చైర్మన్‌ కాదని, మండలి చైర్మన్‌ పదవి తీసుకున్నాక తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ‘ఉద్యోగ నియామకాల మీద బీఆర్‌ఎస్‌ మాట్లాడుతోంది..ఆనాడు మీరేం చేశారు?ఎమ్మెల్యేల ఫిరాయింపుల  అంశంలో గత  ప్రభుత్వం ఏం చేసిందో గుర్తు చేసుకుంటే మంచిది. 

ALSO READ | ఈ రాష్ట్రం మీది.. మీ కోసమే మేమున్నాం: డిప్యూటి సీఎం భట్టి

మూసీపై డీపీఆర్‌ కాకముందే ఆరోపణలు చేయడం సరికాదు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై మాట్లాడే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆర్థిక వనరులు ఉన్నాలేకపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తోంది. ప్రతిపక్ష నాయకులు వాడుతున్న భాషా సరిగా లేదు. ఒక పని ప్రభుత్వం చేస్తుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ కౌంట్ చేయవద్దు. మూసీ ప్రక్షాళన కూడా అంతే.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. హైడ్రా వల్లే రిజిస్ట్రేషన్లు పడిపోయాయి..ఆదాయం తగ్గిందనడం కరెక్ట్ కాదు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉంది. అన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల ఖర్చు పెంచారు.. దీనికి అందరూ బాధ్యులే’అని అన్నారు.