
రాయికల్, వెలుగు: రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం కుష్ఠు వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులో గత నెలలో రాయికల్ మండలంలో గుర్తించిన 85 మంది కుష్ఠు అనుమానితులను స్క్రీనింగ్ చేసి 10 మందిని తదుపరి టెస్ట్లకు రెఫర్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్వో ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ శరీరంపై స్పర్షలేని మచ్చలు ఉంటే డాక్టర్లను సంప్రదించి టెస్ట్లు చేయించుకోవాలన్నారు. ప్రైమరీ దశలోనే వ్యాధిని గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చన్నారు. హెల్త్ క్యాంపులో డీపీఎంవో హీర్యానాయక్, మెడికల్ ఆఫీసర్ సతీశ్కుమార్, సీహెచ్వో ప్రమీల, సిబ్బంది టి.శ్రీధర్, సంతోష్ కుమార్, ఏఎన్ఎంలు , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.