ఎల్జీ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

ఎల్జీ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: ఎల్జీ ఎలక్ట్రానిక్స్​ ఇండియా ఐపీఓకు సెబీ గురువారం గ్రీన్​సిగ్నల్ ​ఇచ్చింది. ఈ సౌత్​కొరియా కంపెనీ పబ్లిక్​ ఇష్యూ ద్వారా రూ.15 వేల కోట్ల వరకు  సేకరించనుంది. గత ఏడాది డిసెంబరులో ఐపీఓ కోసం ఎల్జీ ఎలక్ట్రానిక్స్​ ప్రిలిమినరీ పేపర్లను సెబీకి అందజేసింది. ఐపీఓ ద్వారా 15 శాతం వాటాను అమ్మకానికి పెడతామని తెలియజేసింది.

 ఇది పూర్తి ఆఫర్​ఫర్​సేల్​ఇష్యూ కాబట్టి కంపెనీకి ఆదాయం రాదు. డబ్బంతా దక్షిణ కొరియాలోని పేరెంట్​కంపెనీకే వెళ్తుంది. ఐపీఓ కోసం ఎల్జీ గత నెల చాలా చోట్ల రోడ్​షోలను నిర్వహించింది. ఈ కంపెనీకి మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఇండియా కార్యకలాపాల ద్వారా రూ. 64,087.97 కోట్ల ఆదాయం వచ్చింది.