కొత్త ప్లాన్​ తెచ్చిన ఎల్​ఐసీ

కొత్త ప్లాన్​ తెచ్చిన ఎల్​ఐసీ

హైదరాబాద్​, వెలుగు: సింగిల్ ప్రీమియం గ్రూప్ మైక్రో టర్మ్ ఇన్సూరెన్స్‌‌ను ఎల్​ఐసీ సోమవారం ప్రవేశపెట్టింది. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్, గ్రూప్, ప్యూర్ రిస్క్ ప్లాన్. మైక్రో ఫైనాన్స్‌‌తో సహా ఫైనాన్స్ సంస్థల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది.

సంస్థలు, కో–-ఆపరేటివ్‌‌లు, ఎస్​హెచ్​జీలు, ఎన్జీఓలు తమ ఉద్యోగులు లేదా సభ్యుల కోసం తీసుకోవచ్చు. దీనిని  50 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల కోసం కొనవచ్చు. రూ.ఐదు వేల నుంచి రూ.20 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు.