
న్యూఢిల్లీ: ఈనెలాఖరులోపే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొంటామని ఎల్ఐసీ సీఈఓ సిద్ధార్థ మహంతీ మంగళవారం ప్రకటించారు. చర్చలు తుదిదశలో ఉన్నాయని, మరికొన్ని రోజుల్లో ఒప్పందం ఖరారు అవుతుందని వెల్లడించారు. కంపెనీ పేరును మాత్రం బయటపెట్టలేదు. అయితే వాటా 51 శాతాన్ని మించబోదని, కంట్రోల్స్టేక్ను తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత రూల్స్ప్రకారం జీవితబీమా కంపెనీలు హెల్త్కవర్ అందించకూడదు.
వీటికి కాంపోజిట్ లైసెన్స్ ఇవ్వాలనే సూచన వచ్చినా, బడ్జెట్లో మాత్రం ప్రభుత్వం ప్రకటన చేయలేదు. అయితే ఎల్ఐసీ మణిపాల్ సిగ్నాలో రూ.నాలుగు వేల కోట్ల విలువైన వాటాలు కొనబోతున్నట్టు తెలుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో ఎల్ఐసీ నికర ప్రీమియం ఆదాయం 9 శాతం తగ్గి రూ.1.06 లక్షల కోట్లకు చేరుకుంది.
స్టాండ్ఎలోన్ నికర లాభం 17 శాతం పెరిగి రూ.11,056 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఆర్బీఐ వందేళ్ల గర్నమెంట్బాండ్లను ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా మహంతీ కోరారు. ప్రస్తుతం 40 ఏళ్ల బాండ్లకే అనుమతులు ఉన్నాయని, వీటికి 50 ఏళ్లకు, వందేళ్లకు పెంచాలని కోరామని తెలిపారు.