న్యూఢిల్లీ: మినిమమ్పబ్లిక్ షేర్హోల్డింగ్ (ఎంపీఎస్) రూల్స్కు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో 5 శాతం వరకు వాటాను అమ్మవచ్చని తెలుస్తోంది. కేంద్రం ఎల్ఐసీ ఐపీఓ ద్వారా మే 2022లో రూ.21వేల కోట్లను సేకరించింది. ఎల్ఐసీ ఐపీఓ, భారత క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో ఇప్పటివరకు అతిపెద్దది. ఇష్యూను పూర్తిగా ఆఫర్ -ఫర్ -సేల్ విధానంలో నిర్వహించారు.
ఎల్ఐసీలో 96.5 శాతం వాటాను కలిగి ఉన్న ప్రభుత్వం, తన వాటాలో కొంత భాగాన్ని అమ్మడానికి ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ), క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) వంటి విధానాలను పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్ఐసీ లిస్టింగ్ తేదీ నుంచి 10 సంవత్సరాలలోపు 25 శాతం ఎంపీఎస్ను సాధించాలి.