ఇడువని ముసురు.. అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు

ఇడువని ముసురు.. అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు
  • రాష్ట్రవాప్తంగా కొద్ది రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న వర్షం
  • శ్రీశైలానికి భారీగా వరద

హైదరాబాద్​, వెలుగు: కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని ముసురు వదలడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉమ్మడి మహబూబ్​నగర్​, ఉమ్మడి ఖమ్మం 
జిల్లాల్లో మినహా అన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​లో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంటిన్యూగా వర్షాలు పడుతుండడంతో కృష్ణా బేసిన్​లోని నదులకు వరద పోటెత్తుతున్నది. 

ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం 2,54,700 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఓ వైపు జూరాలతోపాటు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలోకి ఇన్​ఫ్లో వస్తుండడంతో నీటి మట్టం పెరుగుతున్నది.