మందుబాబులకు బంపరాఫర్​: బాటిల్​ కొంటే .. థాయ్​లాండ్​ టూర్​ ఉచితం

మందుబాబులకు బంపరాఫర్​:  బాటిల్​ కొంటే ..  థాయ్​లాండ్​ టూర్​ ఉచితం

వ్యాపారస్తులు బిజినెస్​ ను పెంచుకొనేందుకు.. కష్టమర్లను ఆకట్టుకునేందుకు అనేక ట్రిక్కులను ఉపయోగిస్తారు.  ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. గిప్ట్​ కూపన్స్​.. డిస్కౌంట్​ ఆఫర్స్.. లాటరీ ద్వారా బహుమతులు ​ ఇలా ఒకటేమిటి అనేకమైనవి వింటున్నాం.. చూస్తున్నాం.  అయితే తాజాగా ఇప్పుడు ఓ మద్యం వ్యాపారి ఆ షాపులో చుక్క తాగకుండానే కిక్కు ఎక్కే ఆఫర్​ప్రకటించాడు. 

కాకినాడకు చెందిన ఓ లిక్కర్​ షాపు యజమాని  మందు తాగండి .. థాయ్​లాండ్​ వెళ్లండి అంటూ పోటీలు ఏర్పాటు చేశాడు. తన దుకాణంలో అన్నిరకాల బ్రాండ్లు దొరుకుతాయంటూ.. మద్యం కొన్న వారికి టోకెన్లు ఇస్తామని ప్రకటించారు.  కావలసిన బ్రాండ్​ ను ఫుల్లుగా తాగడమే కాదు ఫ్రీగా.. థాయ్​లాండ్​ వెళ్లే అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ ప్రకటించాడు.

ALSO READ | తిరుపతిలో బయటపడ్డ పురాతన విగ్రహం.. స్వామి వారి పాదాలు చూడండి..

మద్యం ప్రియులు తమ షాపులో బాటిల్​ కొంటే.. టోకెన్​ ఇస్తామని... లాటరీ లో గెలుపొందిన వారికి కారు, బైక్​, సెల్​ఫోన్​ వంటి గిఫ్ట్​లను రూ. 1.5 లక్షల విలువైన బహుమతులు ఉన్నాయి.  అంతే కాదు లాటరీ లో మొదటి బహుమతి గెలుపొందిన వారు ఏకంగా థాయ్​లాండ్​ వెళ్లొచ్చు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.  ప్రస్తుతం ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.ఈ ప్రకటన చూసిన మందుబాబులు కాకినాడలోని ఆషాపునకు క్యూ కట్టారు.  మరి థాయ్​లాండ్​ఫ్రీ టూర్​ అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి.