ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..  బోయినపల్లి అభిషేక్​కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..  బోయినపల్లి అభిషేక్​కు బెయిల్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు బోయినపల్లి అభిషేక్​కు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్​ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్​ సమయంలో విధించిన షరతులను రద్దు చేశామని స్పష్టం చేసింది. 2023 జులైలో ఢిల్లీ హైకోర్టు బెయిల్​ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్.. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ తో కూడిన బెంచ్ సోమవారం విచారించింది.

అభిషేక్ తరఫున అడ్వకేట్ వాదనలు కొనసాగిస్తూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు అందరూ బెయిల్​పై బయటే ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్​పై ఉన్న అభిషేక్​కూ సాధారణ బెయిల్​ మంజూరు చేయాలని కోరారు. దీని పై ఈడీ వాదనలు వినిపించాలని కోరగా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఎటువంటి అభ్యతరం తెలపలేదు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. అభిషేక్ కు బెయిల్​ మంజూరు చేసింది.