
మనోహరాబాద్, వెలుగు : మండలంలోని కాళ్లకల్ గ్రామంలో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.