మియాపూర్​లో కనిపించింది....పులి కాదు.. అడవి పిల్లి

మియాపూర్​లో కనిపించింది....పులి కాదు.. అడవి పిల్లి
  • తేల్చిన అటవీ శాఖ అధికారులు

మియాపూర్, వెలుగు: మియాపూర్​ మెట్రో స్టేషన్​ వెనుక వైపు శుక్రవారం రాత్రి చిరుతపులి కనిపించిందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, అది చిరుత కాదు.. అడవి పిల్లి అని అటవీ శాఖ అధికారులు తేల్చారు. శుక్రవారం రాత్రి మియాపూర్​ మెట్రో స్టేషన్​ వెనుక వైపు మట్టికట్టపై చిరుతపులి కనిపించిందనే వార్తలు, వీడియోల ను మియాపూర్ పోలీసులు అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

శంషాబాద్, మేడ్చల్​​ ఫారెస్ట్​ డీవోలు విజయానందరావు, జానకిరాం పోలీసులతో కలిసి అక్కడికి చేరుకొ ని పాదముద్రలు పరిశీలించారు. చిరుత పాదముద్ర లు 8 ఇంచులు  ఉంటాయని.. అక్కడున్న ముద్రలు 4 ఇంచుల లోపే ఉన్నాయని, దీంతో  అది చిరుత కాదని తేల్చారు.