కమనీయం శ్రీవారి కల్యాణం

కమనీయం శ్రీవారి కల్యాణం

వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం అలివేలు మంగ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా సాగింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్​ఘడ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకలకు జాతీయ మిర్చి టాస్క్​ ఫోర్స్​ మెంబర్​ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. 

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేయగా, సత్యసాయిబాబా సేవా ట్రస్ట్​ ఆధ్వర్యంలో బీవీ రామారావు బటర్​ మిల్క్​ పంపిణీ చేశారు. ఆటో యూనియన్​ ఆధ్వర్యంలో అంబేద్కర్​ సెంటర్​ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా, భక్తుల సౌకర్యార్థం తాగునీరు, టాయిలెట్స్​ ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు.