
గజ్వేల్... సిద్దిపేట రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం ( మార్చి 23) 8 గంటలకు హమ్ దీపూర్ శివారులోని పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్.. లారీ ఢీకొన్నాయి. సిద్దిపేట నుంచి వస్తున్న లారీ.. బైక్ వెళ్తున్న దంపతులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. భర్తకు రెండు కాళ్లు శరీరం నుంచి విడిపోయాయి. సమాచారం అందుకున్న గజ్వేల్ ఎంపీటీసీ పంగ మల్లేశం 108 కు ఫోన్ చేసి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం భర్త పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.