జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

 

  • లారీ,  ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ముగ్గురు మృతి   

  •  పలువురికి గాయాలు 

హైదరాబాద్ :  జనగామ జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది.   లారీ, ఆర్టీసీ బస్సు  ఢీ కొన్న ఘటనలో ముగ్గురు  చనిపోయారు.  పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ విషాదకర సంఘటన  పాలకుర్తి మండలం వావిలాలలో చోటు చేసుకుంది.  ఆర్టీసీ బస్సు పాలకుర్తి నుంచి తొర్రూరు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.   వావిలాల గ్రామంలోని ఓ మూల మలుపు వద్ద ఎదురెదురుగా లారీ, ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి.

 ఈ ప్రమాదంలో మహబూబ్ గర్ జిల్లా తొర్రూరు మండలం టీక్యా తండాకు చెందిన హేమాని (65), అతని భార్య బుజ్జమ్మ(60) పాలకుర్తి మండలానికి చెందిన హసీమా (58) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  డెడ్​బాడీలను  గవర్నమెంట్​ దవాఖానకు తరలించారు.   గాయపడ్డవారు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.  పోలీసులు   కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,  డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించారు.