ఆర్నెళ్ల కింద ప్రేమపెళ్లి .. ఉరేసుకొని గృహిణి మృతి

ఆర్నెళ్ల కింద ప్రేమపెళ్లి .. ఉరేసుకొని గృహిణి మృతి

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఓ మహిళ ఉరేసుకుంది. బోయిగూడకు చెందిన చింతల అరుణ (29)పెద్దపల్లి ప్రాంతానికి చెందిన రాకేష్ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మార్చిలో పెండ్లి చేసుకున్నారు. బోడుప్పల్ లోని ఆర్ఎన్ఎస్ కాలనీ ఉంటున్నారు. బుధవారం భర్త ఇంట్లో లేకపోవడంతో ఉరేసుకుంది. భర్త వచ్చిన తర్వాత డోర్ కొట్టినా తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా ఉరేసుకొని ఉంది. 

ప్రైవేట్​ హాస్పిటల్​కు తీసుకుపోగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. తన కూతురు చావుకు భర్త రాకేశ్​,అత్తమామ,ఆడబిడ్డల వరకట్న వేధింపులే కారణమని మృతురాలి తల్లి లలిత మేడిపల్లి పీఎస్​లో ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.