
హైదరాబాద్ లో మహిళా మృతదేహం లభ్యమైంది. లోయర్ ట్యాంక్ బండ్ డిబిఆర్ మిల్లు లో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆరు నెలల క్రితం హత్య చేసి డీబీఆర్ మిల్ మూడో అంతస్తులో ఉన్న సంపులో పడేశారు. అస్తిపంజరంగా మారింది. డీబీఆర్ మిల్లులోని నీటి సంపులో మృతదేహాన్ని చూసిన సెక్యూరిటి సిబ్బంది దోమలగూడ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై కేసు నమోదు చేసి .. అస్థిపంజరాన్ని పోస్ట్మార్టానికి తరలించారు.