![ఆర్మీ కొత్త చీఫ్గా మనోజ్ పాండే](https://static.v6velugu.com/uploads/2022/04/Lt-Gen-Manoj-Pande-named-new-Army-chief,-first-from-Corps-of-Engineers_pQArSL2VUW.jpg)
న్యూఢిల్లీ: తదుపరి ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులు కానున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండడంతో ఆయన స్థానంలో మనోజ్పాండే బాధ్యతలు స్వీకరించనున్నారు. లెఫ్టినెంట్ జనరల్ పాండే ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ గా ఉన్నారు. అంతకుముందు సిక్కిం, అరుణాచల్ప్రదేశ్సెక్టార్లలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వద్ద ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ హెడ్గా బాధ్యతలు నిర్వహించారు. 1982 డిసెంబర్లో బాంబే సపర్స్తో లెఫ్టినెంట్ జనరల్ పాండే కెరీర్ మొదలైంది. తన సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎన్నో కీలకమైన బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఎన్నోరకాల కౌంటర్ ఇన్సర్జన్సీ ఆపరేషన్లలో భాగస్వామిగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్ లో ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఇంజనీర్ రెజిమెంట్కు నేతృత్వం వహించారు. వెస్ట్రన్ లడాఖ్ ఏరియాల్లో మౌంటెడ్ డిజిజన్కు హెడ్గా ఉన్నారు. ఇథియోపియా, ఎరిత్రియాల్లో యూఎన్ మిషన్లలో చీఫ్ ఇంజనీర్గా ఆయన సేవలందించారు. 2020 జూన్ నుంచి 2021 మే వరకు అండమాన్, నికోబార్ కమాండ్కు కమాండర్ ఇన్ చీఫ్గానూ వ్యవహరించారు. ఆయన అందించిన సేవలకు గానూ పరమ్ విశిష్ట సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, విశిష్ట సేవా మెడల్ వంటి పురస్కారాలు పొందారు.