
ఈ ఊరు ఒకప్పుడు డైమండ్ మైనింగ్కి పాపులర్. ఇప్పుడు నమీబియా టూరిజంలో టాప్ టూరిస్ట్ ప్లేస్. ఇప్పటికీ అక్కడి సముద్రంలో వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది. ఆ ఊరి పేరే లూడెరిట్జ్. నమీబియాలోని ఒక చిన్న ఊరు ఇది. ఆ ఊరికే కాదు.. దాని పేరు వెనక కూడా ఒక కథ ఉంది.
అది 1883 వ సంవత్సరం.. బర్తలోమయి దియజ్, బ్రెమెన్ టొబాకొనిస్ట్ అడాల్ఫ్ లూడెరిట్జ్ అనే ఇద్దరు కలిసి సముద్రం దగ్గర ఒక ట్రేడింగ్ పోస్ట్ ఏర్పాటుచేశారు. దాన్ని ‘లూడెరిట్జార్ట్’ అని పిలిచేవాళ్లు. ఆ తర్వాతి ఏడాది వ్యాపారుల కోరిక మేరకు ఆ ప్రాంతం జర్మనీ రాజ్య రక్షణలోకి వెళ్లింది.
అప్పటి వరకు పనికిరాదు అనుకున్న ఆ నేలలో ఖనిజ సంపద దొరుకుతుందేమో అని చాలామంది ఆశపడ్డారు. వాటికోసం వెతకడం మొదలుపెట్టారు. కొంతకాలానికి కొన్ని ఆర్థిక కారణాల వల్ల అడాల్ఫ్ లూడెరిట్జ్ అనే వ్యక్తి, సౌత్ వెస్ట్ ఆఫ్రికాలోని జర్మన్ కలొనియల్ కంపెనీకి ప్రాపర్టీని అమ్మకానికి పెట్టాడు. ఆ తర్వాత ఆ ప్రదేశానికి ‘లూడెరిట్జ్’ అనే పేరు వచ్చింది.
వజ్రం దొరికింది
చాలా ఏండ్లుగా లూడెరిట్జ్ ప్రాంతంలో ఖనిజాల వేట మొదలైంది. అయితే ఎన్నో ఏండ్ల శ్రమ తర్వాత 1908లో మొదటిసారి ఒక వజ్రం దొరికింది. అది కూడా ఎంతో విలువైన వజ్రం. లూడెరిట్జ్కి దగ్గర్లోని రైల్వే ట్రాక్ దగ్గర ఇసుక తవ్వుతున్నప్పుడు కనిపించింది. ఆ వజ్రం చాలామందిలో ఆశలు రేకెత్తించింది. ఆ తర్వాత అక్కడ పోర్ట్ సిటీ అభివృద్ధి చెందడానికి ఆ వజ్రమే కారణమైంది. కానీ, ఆ తరువాత కొంతకాలానికే లూడెరిట్జ్ ట్రేడింగ్ పోర్ట్ సిటీ కాస్త నార్త్ స్వకొప్మండ్గా మారింది. అక్కడ ట్రేడింగ్ జరగడం ఆగిపోయింది.
ఆ తర్వాత మొదటి ప్రపంచయుద్ధం జరగడంతో దక్షిణాఫ్రికా ట్రూప్లు లూడెరిట్జ్ పోర్ట్ని ఆక్రమించాయి. యుద్ధం ముగిశాక ఆ చిన్న ఊరు దక్షిణాఫ్రికాలో భాగమైపోయింది. లూడెరిట్జ్ ఇప్పుడు ఖారాస్ ప్రాంతంలో ఉంది. జర్మనీలో అతి తక్కువ మంది జనాభా ఉన్న ప్రాంతం అది. చిన్న గ్రామమే అయినప్పటికీ సిటీ స్కేప్లు, అద్భుతమైన ఆర్కిటెక్చర్ భలే అందంగా ఆకట్టుకుంటాయి.
ఇక్కడి వాళ్లు చేపలు పట్టడం, ఆల్చిప్పల పెంపకం, టూరిజం వంటి వాటి మీద ఆధారపడి జీవిస్తారు. డైమండ్స్ వెతికేందుకు సముద్రంలోకి ప్రత్యేకమైన షిప్పుల్లో వెళ్తుంటారు. ఊరు చిన్నదైనా చాలా శుభ్రంగా, అందంగా ఉంటుంది. సేఫ్ ప్లేస్ కూడా.
రిచ్ సిటీ టు ఘోస్ట్ సిటీ
లూడెరిట్జ్ టూర్కి వెళ్తే గోస్ట్ టౌన్ కూడా చూసి రావాల్సిందే. దాని పేరు కొల్మన్స్కొప్. ఇది లూడెరిట్జ్కి పది కిలో మీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశం. వజ్రాల వేట జరిగే టైంలో ఈ ఊరికి ఆఫ్రికాలోనే రిచెస్ట్ సిటీగా పేరు. ఎడారిలో ఉన్న ఆ బిల్డింగ్లు కూడా ఎంతో బాగుండేవి. జర్మన్ మోడల్లో కట్టిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్, హాస్పిటల్, షాప్స్ వంటివన్నీ రాతి కట్టడాలే. డైమండ్ మైనింగ్ నమీబియాలోని వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయ్యాక ఈ ఊరి నుంచి ప్రజలు వెళ్లిపోయారు. దాంతో నిర్మానుష్యంగా తయారైంది. అప్పటి నుంచి దీన్ని ఘోస్ట్ టౌన్ అని పిలుస్తున్నారు. ఈ ఊరిని చూడాలంటే లూడెరిట్జ్నుంచి గైడ్ని వెంట పెట్టుకుని వెళ్లొచ్చు.
చూడాల్సినవి
రాక్ చర్చ్
డైమండ్ మౌంటెన్ మీద రాక్ చర్చ్ ఉంది. దీన్ని కట్టేందుకు వాడిన ఇసుక, కాంక్రీట్ జర్మనీ నుంచి షిప్స్లో తెప్పించారు. చర్చ్ లొకేషన్ నుంచి సిటీ వ్యూ బాగుంటుంది.
గోయెర్కె హౌస్
జర్మనీ ఆఫీసర్ హ్యాన్స్ గోయెర్కె కోసం ఒక ఇంటిని కట్టారు. ఆయన సర్వీస్ పూర్తయ్యాక అక్కడే ‘ డైమండ్ కంపెనీ’ పెట్టుకుని దానికి హెడ్గా ఉన్నాడు హ్యాన్స్. ప్రస్తుతం ఆ బిల్డింగ్ని గెస్ట్ హౌస్లా వాడుతున్నారు. ఈ బిల్డింగ్ నమీబియా నేషనల్ మాన్యుమెంట్స్ లిస్ట్లో కూడా చేరింది.
లూడెరిట్జ్ మ్యూజియం
ఈ మ్యూజియంలో పోర్ట్ సిటీ చరిత్ర, డెవలప్మెంట్కి సంబంధించిన ఆధారాలు ఉంచారు. ఇక్కడ జియాలజీ, ఆర్కియాలజీ స్టూడెంట్స్కి చాలా ఆసక్తికరమైన సమాచారం దొరుకుతుంది.
లూడెరిట్జ్ ట్రైన్ స్టేషన్
లూడెరిట్జ్లో1904లో ట్రైన్ స్టేషన్ కట్టారు. పోర్ట్ సిటీని లోతట్టు ప్రాంతాలకు కనెక్ట్ చేసేందుకు దీన్ని కట్టారు. రైల్వే లైన్ని హెరెరో, నామా ట్రైబ్స్ మొదట్లో ట్రాన్స్పోర్ట్ వెపన్స్గా వాడేవారు. ఆ రైలు మార్గం డైమండ్ మైనింగ్ జరిగే చోటుకు వెళ్తుంది. ఇప్పుడు ట్రాన్స్ నమీబ్ రైల్వే కంపెనీ 300 కిలో మీటర్ల నుంచి మాంగనీస్ ఓర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. నెలకు కొన్ని టన్నుల మాంగనీస్ రవాణా జరుగుతోంది.
చేయాల్సినవి
క్రూయిజ్ షిప్ టూర్లు
ఈ ఊళ్లో స్మాల్, మీడియం క్రూయిజ్ షిప్లు తిరుగుతుంటాయి. కాబట్టి బడ్జెట్ని బట్టి ఎవరికి నచ్చిన వాటిని వాళ్లు సెలెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. డిసెంబర్ నుంచి మార్చి వరకు క్రూయిజ్ సీజన్. అప్పుడు షిప్ జర్నీ బాగుంటుంది. క్రూయిజ్ షిప్లో తిరుగుతూ పెంగ్విన్ కాలనీలు, సముద్ర వాతావరణం, ల్యాండ్స్కేప్లు, సముద్ర జీవులు, పక్షుల్ని చూడొచ్చు. పెంగ్విన్లను చూడటానికి పెంగ్విన్ ఐలాండ్కు టూర్ వేయొచ్చు.
ఆ ఐలాండ్ని ‘హలిఫాక్స్ ఐలాండ్’ అని కూడా అంటారు. అక్కడ పెంగ్విన్లతో పాటు డాల్ఫిన్, పక్షులు, సీల్స్, తిమింగలాలు కనిపిస్తాయి. బోట్ టూర్ చేసే వాళ్లు ‘దియజ్ పాయింట్, లైట్ హౌస్’ చూడొచ్చు. నమీబియా అడవి గుర్రాలు చూడాలంటే గారుబ్ విలేజ్కి వెళ్లాలి. ఇది లూడెరిట్జ్ నుంచి వంద కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అడవి గుర్రాలను ఇక్కడ వాళ్లు పెంచుతారు. ఇంతకు ముందు డైమండ్ గనులు ఉన్న చోట ఇప్పుడు దాదాపు వంద రకాల జంతువులు ఉన్నాయి.
1986 లో ఈ ప్రాంతం నేషనల్ పార్క్ హోదా సంపాదించింది. ఆ తర్వాత ఐదేండ్లు కరువు వచ్చింది. దాంతో ఎడారి ప్రాంతంలోని జంతువులన్నీ అంతరించిపోసాగాయి. గారుబ్లో గుర్రాలకు మాత్రం నీళ్లు అందుబాటులో ఉంచారు.