
హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రణీత్ గ్రూప్ రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ప్రణీత్ ప్రణవ్ రెడ్ఫెర్న్ స్క్వేర్ను ఆదివారం ప్రారంభించింది. రూ. వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయనుంది.
30 ఎకరాలలో విస్తరించి ఉన్న రెడ్ఫెర్న్ స్క్వేర్లో 350 కి పైగా విల్లాలు ఉంటాయి. ఒక్కొక్కటి 180 నుంచి 350 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటుంది. చదరపు అడుగు ధర రూ.8,000. వసతులకు అదనంగా చెల్లించాలి.