
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి ఎస్పీగా ఎం. రాజేశ్చంద్రను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి డీసీపీగా పని చేస్తున్నారు. ఇక్కడ ఎప్పీగా పని చేస్తున్న సింధూశర్మ ఇంటలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. సింధూశర్మ 2022 అక్టోబర్లో ఇక్కడకు బదిలీపై వచ్చారు. జిల్లాలో ఏడాదిన్నర పాటు పని చేశారు.