మై హోం లడ్డూ@ 29 లక్షలు

మై హోం లడ్డూ@ 29 లక్షలు
  • బాలాపూర్​కు దీటుగా మైహోం భుజాలో వేలం పాట
  • రూ.29లక్షలకు దక్కించుకున్న బిజినెస్​ మేన్ గణేశ్​

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​పరిధిలోని మైహోం భుజా అపార్ట్​మెంట్​లో వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికింది. ఆదివారం నిర్వహించిన వేలంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన బిజినెస్​మేన్​ కొండపల్లి గణేశ్​రూ.29 లక్షలకు దక్కించుకున్నాడు. ఏటా బాలాపూర్​లడ్డూకు దీటుగా ఇక్కడ గణేశ్​లడ్డూ వేలం జరుగుతోంది. గతేడాది బాలాపూర్​వినాయకుడి లడ్డూ ధర రూ.27లక్షలు కాగా, మైహోం భుజాలోని లడ్డూ రూ.25.50 లక్షలు పలికింది. ఈసారి అంతకు మించి వేలం జరగడం విశేషం. 

ముడిమ్యాలలో రూ.12.16 లక్షలు

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లమండలం ముడిమ్యాలలోని గణేశ్​లడ్డూ రూ.12.16 లక్షలు పలికింది. ఆదివారం నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన హరికిషన్​రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.