టైగర్ రిజర్వ్​గా మాధవ్​ నేషనల్​ పార్క్​

 టైగర్ రిజర్వ్​గా మాధవ్​ నేషనల్​ పార్క్​

దేశంలోని పులుల జనాభాను సంరక్షించాలన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్​ చంబల్ ​ప్రాంతంలోని శివపురి జిల్లాలో ఉన్న మాధవ్​ నేషనల్​ పార్క్​ను మధ్యప్రదేశ్​లో 9వ టైగర్ రిజర్వ్​గా, దేశంలో 58వ టైగర్ రిజర్వ్​గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఎగువ వింధ్య పర్వతాల్లో దాదాపు 355 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాధవ్​ నేషనల్ పార్క్ విస్తరించి ఉన్నది.

 దీనిని1958లో నేషనల్​ పార్క్​గా ప్రకటించారు. ఈ నేషనల్​ పార్క్​లో ఇటీవల జన్మించిన కూనలతో సహా ప్రస్తుతం ఐదు పులులు ఉన్నాయి. మరో రెండు పులులను త్వరలో విడుదల చేయనున్నారు. ఈ టైగర్ రిజర్వ్​లో పులుల జనాభాను సంరక్షించేందుకు ఎన్​టీసీఏ నుంచి నిధులు కూడా అందుతాయి. 

మధ్యప్రదేశ్​లోని టైగర్ రిజర్వులు 

కన్హా, సత్పురా, బాంధవ్​ఘర్, పెంచ్, సంజయ్​దుబ్రి, పన్నా, వీరాంగన దుర్గావతి, రతపాని టైగర్ రిజర్వ్, మాధవ్​ నేషనల్​ పార్క్​

టైగర్ రిజర్వ్​ల సంఖ్య 58

దేశంలో 56వ టైగర్​ రిజర్వ్​గా చత్తీస్​గఢ్​లోని గురు ఘాసిదాస్​–తామోర్​పింగ్లా టైగర్ రిజర్వ్​, 2024లో 57వ టైగర్​ రిజర్వ్​గా మధ్యప్రదేశ్​లోని రతపాని ఫారెస్ట్​ టైగర్ రిజర్వ్, ప్రస్తుతం మాధవ్​ నేషన్​ పార్క్​58వ టైగర్​ రిజర్వ్​గా గుర్తింపు పొందడంతో భారతదేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య 58కి చేరుకున్నది. 

దేశంలో పులుల జనాభా ​

ప్రపంచంలోని మొత్తం పులుల జనాభాలో 70 శాతానికి పైగా భారతదేశంలో ఉంది. ఆల్​ ఇండియా టైగర్ ఎస్టిమేషన్​ 2022 గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 3167 పైగా పులులు ఉన్నాయి. అయితే, 2018లో 2967, 2014లో 2256 పులులు ఉండేవి. ఈ లెక్కన చూసుకుంటే దేశంలో పులుల సంఖ్య పెరుగుతున్నది. 

సంరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలు ఇంటర్నేషనల్​ బిగ్​ క్యాట్స్ అలయెన్స్​: టైగర్​ కన్జర్వేషన్ ప్రోగ్రామ్​(ప్రాజెక్ట్​ టైగర్) 50వ వార్షికోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ​బిగ్​ క్యాట్స్ అలయెన్స్
(ఐబీసీఏ)ను 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పులి, సింహం, చిరుతపులి, స్నో లెపర్డ్, జాగ్వర్, ప్యూమా, చీతా వంటి ప్రపంచంలోని ఏడు ప్రధాన పిల్లుల జాతికి చెందిన వీటిని సంరక్షించాలని ఈ కూటమి లక్ష్యంగా పెట్టుకున్నది. 

ఫారెస్ట్​ లైఫ్​ ప్రొటెక్షన్​ యాక్ట్​ 1972: దేశంలోని పులులను సంరక్షించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.

ప్రాజెక్ట్ ​టైగర్: దేశంలోని పులులను రక్షించి వాటి జనాభా పెంపొందించేందుకు భారత ప్రభుత్వం 1973, ఏప్రిల్​ 1న ప్రాజెక్ట్​ టైగర్​ను జిమ్​ కార్బెట్​ జాతీయ పార్కులో చేపట్టింది. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. ప్రపంచంలోనే అతి పెద్దదైన పులుల సంరక్షణ ప్రాజెక్టుగా నిలిచింది.

మోటో: ఇండియా లీడ్స్ టైగర్ కన్జర్వేషన్​

పులుల గణన: నేషనల్​ టైగర్ కన్జర్వేషన్​అథారిటీ(ఎన్ టీసీఏ), వైల్డ్ లైఫ్​ ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ ఇండియా(డబ్ల్యూఐఐ)లు, రాష్ట్రాల అటవీ ఏజెన్సీలు, పరిరక్షణ ఎన్​జీఓల సహాయంతో భారతదేశంలో పులుల జనాభాను ప్రతి నాలుగేండ్లకు ఒకసారి లెక్కిస్తుంది. 

ఎం–ఎస్ టీఆర్ఐపీఈఎస్ సాఫ్ట్​వేర్​

ఎం-ఎస్ టీఆర్ఐపీఈఎస్ అనే సాఫ్ట్ వేర్​ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వుల్లో ప్రవేశపెట్టారు. అటవీ అధికారులకు పులులను సంరక్షించడంలోనూ పర్యవేక్షించడంలోనూ ఈ సాఫ్ట్​వేర్ ఉపయోగపడుతుంది. 

పులుల సంరక్షణపై సెయింట్​ పీటర్స్ బర్గ్​ ప్రకటన

2010లో పీటర్స్ బర్గ్​ టైగర్ సమ్మిట్​ సందర్భంగా పులులకు నిలయంగా ఉన్న భారతదేశంతో సహా 13 దేశాల నాయకులు ప్రపంచవ్యాప్తంగా పులులను రక్షించడానికి, వాటి జనాభాను రెట్టింపు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని నిర్ణయించారు.  

ALSO READ | Success: హెచ్​సీయూతో బయోఫ్యాక్టర్ ఒప్పందం