మా ఉద్యోగాలు మాకు కేటాయించండి: మాదిగ దండోరా నాయకులు

మా ఉద్యోగాలు మాకు కేటాయించండి: మాదిగ దండోరా నాయకులు
  • మాదిగ దండోరా ఆధ్వర్యంలో... సీఎంకు సాష్టాంగ నమస్కారం

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చేసి తమ వాటా ఉద్యోగాలను తమకు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మాదిగ దండోరా నాయకులు శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి ఇంటి ముందు సాష్టాంగ నమస్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  చెరువులు, కుంటలను ఎఫ్​టీఎల్,  బఫర్ జోన్ భూములను కాపాడేందుకు హైడ్రా ను ఏర్పాటు చేసినట్లే  మాదిగలకు రావాల్సిన ఉద్యోగాలను కబ్జా చేస్తున్న వారి నుంచి కాపాడాలని కోరారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు ఇచ్చాక న్యాయపరమైన చిక్కులు ఎలా వస్తాయని, అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.