25 నుంచి మాదిగల ధర్మయుద్ధ మహాసభలు

25 నుంచి మాదిగల ధర్మయుద్ధ మహాసభలు
  •     ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ 

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్​రెడ్డి మాల సామాజికవర్గ నేతల ఒత్తిడికి లొంగి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాడని ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.  గురువారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని, దీనివల్ల మాదిగ బిడ్డల నోటికాడి కూడు లాక్కున్నట్టయ్యిందని మండిపడ్డారు.

 వర్గీకరణ అమలు చేయకుండా టీచర్​పోస్టులను భర్తీ చేసినందుకు నిరసనగా అన్ని జిల్లాల్లో ఈనెల 25 నుంచి 31 వరకు ‘మాదిగల ధర్మయుద్ధ మహాసభలు’ నిర్వహిస్తామని, నవంబరు 4 నుంచి 14 వరకు 119 నియోజక వర్గాల్లో మాదిగల ధర్మయుద్ధ దీక్షలు, నవంబరు 16 నుంచి డిసెంబరు 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల ధర్మయుద్ధ రథయాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు.