భారీ క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ మహా గణపతి

భారీ క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ మహా గణపతి

హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనం ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రెండున్న కిలో మీటర్ల శోభాయాత్ర ముగించుకొని 70 అడుగుల ఎత్తున్న ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు. భక్తుల ఆటపాటల నడుమ.. భజన కీర్తనలతో గణనాథులు సాగర తీరానికి వచ్చేశాడు. 100 టన్నుల బరువు మోయగల సామర్థ్యం ఉన్న టస్కర్ లో భారీ విగ్రహాన్ని ఎన్టీఆర్ మార్ట్ లోని ట్యాంక్ బండ్ కు తరలించారు. 70 టన్నుల బరువున్న బడా గణపతిని నిమజ్జనం చేయడానికి భారీ బహుబలి క్రేన్ ఏర్పాటు చేశారు. ఈ క్రేన్ 350 టన్నుల బరువును ఎత్తగలిగే సామర్ధ్యం కలిగిఉంది.

మహా గణపతి పక్కన పెట్టిన శివపార్వతులు విగ్రహాలు క్రేన్ నెంబర్ 5 దగ్గర నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ గణేశ్ ను మాత్రం క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం చేయనున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ మహా గణపతి  క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకోనున్నాడు. నిమజ్జనానికి ముందు పండితులు ఉత్తర పూజ నిర్వహించనున్నారు.