ఝరాసంగంలో శేషవాహనంపై ఊరేగిన సంగమేశ్వరుడు

ఝరాసంగంలో శేషవాహనంపై ఊరేగిన సంగమేశ్వరుడు

ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి వారు శేషవాహనంపై ఊరేగారు. మహిళలు మంగళహారతులతో వచ్చి స్వామిని కొలిచి ఆశీస్సులు తీసుకున్నారు. 

జాతర సందర్భంగా డీఎస్పీ రాంమోహన్​రెడ్డి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సీఐలు హన్మంతు, శివలింగం, ఎస్ఐ నగేశ్, ఇన్​స్పెక్టర్​రంగారావు, ఈవో శివరుద్రప్ప, మాజీ ఎంపీపీ హన్మంత్​రావు పాటిల్, ఉదయ్​శంకర్​పాటిల్​పాల్గొన్నారు.