![మహబూబ్నగర్లో సంబురంగా.. మహానగరోత్సవం](https://static.v6velugu.com/uploads/2025/02/mahabubnagar-mahanagar-utsav-organized-on-occasion-of-its-upgrade-to-mahabubnagar-corporation_roPks3mFYi.jpg)
వెలుగు స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మబూబ్నగర్ : మహబూబ్నగర్ కార్పొరేషన్గా అప్గ్రేడ్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘మహబూబ్నగర్ మహానగరోత్సవం’ శుక్రవారం సంబురంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో రెండు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టర్ విజయేందిర బోయి, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు.
మార్కెట్ స్టాల్స్, ప్రభుత్వ స్టాల్స్, గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముందుగా స్వచ్ఛ వాహనాలు ప్రారంభించారు ఓపెన్ ఆడిటోరియంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శలు ఇచ్చారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.