బోయలను ఎస్టీలో కలిపే వరకు ఉద్యమిస్తా : ​ ఎంపీ డీకే అరుణ

బోయలను ఎస్టీలో కలిపే వరకు ఉద్యమిస్తా : ​ ఎంపీ డీకే అరుణ

మరికల్, వెలుగు: బోయలను ఎస్టీలో కలిపే వరకు ఉద్యమం కొనసాగిస్తానని మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ అన్నారు.  మంగళవారం మండల కేంద్రంలో బోయలను ఎస్టీలో కలపాలని ఇటీవల పార్లమెంట్​సమావేశాల్లో ప్రసంగించిన ఎంపీ డీకే అరుణను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువా, పూలమాలతో నారాయణపేట జిల్లా, మరికల్​ మండల బోయలందరూ కలిసి సన్మానించారు.  అనంతరం ఆమె మాట్లాడుతూ..  ఎస్టీలో కలపాలని ఏండ్ల నుంచి ఉద్యమాలు చేస్తున్న ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎస్టీలో కలిస్తే బోయలు చాలా మంది అన్నీ రకాలుగా అభివృద్ది చెందుతారని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం, కన్మనూర్​ గ్రామాల్లో బీజేపీ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలనుద్దేశించి పలు సూచనలు చేశారు. రాష్ర్ట, జిల్లా, మండల వాల్మీకి నాయకులు కుర్మయ్య, ఎర్రనర్సిములు, సతీష్​, నర్సిములు, చంద్రప్ప, నర్సిములు, ఆంజనేయులు ఉన్నారు. బీజేపీ నాయకులు లక్ష్మీకాంత్​రెడ్డి, నర్సన్​గౌడ్​, తిరుపతిరెడ్డి, వేణు, భాస్కర్​రెడ్డితో పాటు వివిధ గ్రామాల వాల్మీకులు పాల్గొన్నారు.