
మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: చిన్నారి లంగ్స్ నుంచి ఇనుప మేకును శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్ డాక్టర్లు తొలగించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ కు చెందిన చిన్నారి(4) రెండు వారాల నుంచి తీవ్రమైన దగ్గు, పిల్లి కూతలతో బాధపడ్తూ పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి ఎస్వీఎస్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చింది. చిన్నారికి ఛాతిలో ఎక్స్రే తీయగా అందులో ఎడమ వైపు ఊపిరితిత్తి గాలి గొట్టంలో బయట ఇనుప మేకు ఉందని గుర్తించారు. పల్మోనాలజీ డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి లేటెస్ట్ బ్రాన్ కో స్కాన్ పద్ధతి ద్వారా అనస్తీషియా డాక్టర్ అయతుల్లా సహకారంతో ఊపిరితిత్తుల నుంచి ఇనుప మేకు తొలగించారు. ఆపరేషన్లో హెచ్వోడీ డాక్టర్ రెడ్డి, అనస్తీషియా డాక్టర్లు రామకృష్ణ, పీజీ డాక్టర్లు వినయ్, లావణ్య, సిద్దిఖీ, సుమ, గ్రేస్, అనుదీప్, శ్రీవాణి, స్నగ్ధ, శరణ్య, డాక్టర్ నసీన్ పాల్గొన్నారు. ఆపరేషన్ను సక్సెస్ చేసిన వైద్య బృందాన్ని ఎండీ రాంరెడ్డి అభినందించారు.