జోగిపేటలో మహంకాళీ మాత ఊరేగింపు 

జోగిపేటలో మహంకాళీ మాత ఊరేగింపు 
  • ఆకట్టుకున్న పోతురాజుల నృత్యాలు

జోగిపేట, వెలుగు: ఆషాఢ మాసం పురస్కరించుకొని జోగిపేటలోని  పడమటి గౌని (కిందిగల్లి)లో  మంగళవారం సాయంత్రం బోనాలు ఘనంగా నిర్వహించారు. ఆ వార్డు కౌన్సిలర్​ నాగరాజ్ (నాని) ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మహంకాళీ మాత ప్రతిమ ఊరేగింపును నిర్వహించారు.  శ్రీ రాజ రాజేశ్వరీ దేవాలయంలో  ప్రత్యేక పూజలు  నిర్వహించి డప్పుదరువు చప్పుళ్లతో, పోతురాజుల నృత్యాలతో డీజే పాటలతో ఊరేగింపు ముందుకు సాగింది.  

ఈ ఊరేగింపు కార్యక్రమంలో వార్డు మహిళలు, యువకులు, నాయకులు, దశరథ్ డాకూరి అశోక్, వెంకటేశం, ఆంజనేయులు, నర్సింలు, ప్రభు, శ్రీధర్, వినయ్ గౌడ్, మల్లేశం, రమేశ్, సత్యం, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.