బాయిలర్ పేలి 22 మంది కార్మికులకు గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

బాయిలర్ పేలి 22 మంది కార్మికులకు గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శనివారం ఘోర విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఎంఐడీసీ ప్రాంతంలో గజ్‌కేసరి స్టీల్‌ మిల్లులో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలిన ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. ఐరన్‌ స్క్రాప్ నుంచి స్టీల్ కడ్డీలను ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తారని వివరించారు. గాయపడిన కార్మికుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పేలుడు వల్ల ఫ్యాక్టరీలో ఇనుము అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడింది.