మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వస్తం...డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ ధీమా

మహారాష్ట్రలో మళ్లీ అధికారంలోకి వస్తం...డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ ధీమా
  • నాగ్​పూర్ ​సౌత్​వెస్ట్​ స్థానానికి నామినేషన్​

నాగ్​పూర్​: మహారాష్ట్రలో మళ్లీ ‘మహాయుతి’ కూటమిదే అధికారమని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తంచేశారు. తమ పాలన, తాము అమలుచేసిన సంక్షేమ పథకాలే మళ్లీ అధికారం తెచ్చిపెడతాయని తెలిపారు. శుక్రవారం నాగ్​పూర్​ సౌత్​వెస్ట్​ నియోజకవర్గ స్థానానికి ఫడ్నవీస్​ నామినేషన్​ వేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు.

రాష్ట్రంలోని పేద మహిళల సంక్షేమమే లక్ష్యంగా ‘లడ్కీ బహిన్’ స్కీమ్ ను అమలు చేశామని, ప్రతిపక్షాలను ఓడించేందుకు ఆ పథకం లబ్ధిదారులు చాలని అన్నారు. ఈ స్కీమ్​ను ఆపేందుకు కాంగ్రెస్​ లీడర్​ సునీల్​కేదార్​, నానా పటోలే బాంబే హైకోర్టులో పిటిషన్​ కూడా దాఖలు చేశారని గుర్తు చేశారు.  తమ పనే తమ మాటలకంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు.