మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆవును రాజ్యమాతగా ప్రకటిస్తూ సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ సంప్రదాయంలో ఆవులకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను పేర్కొంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత సంప్రదాయంలో గోవులు ప్రత్యేకమని ప్రాచీన కాలం నుంచి ఆధ్యాత్మిక, శాస్త్రీయ సైనిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని ఉత్తర్వులో పేర్కొంది.
తగ్గుతున్న దేశవాళీ ఆవులపై ఆందోళన
దేశీయ ఆవుల సంఖ్య తగ్గడంపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయంలో ఆవు పేడను ఉపయోగిస్తాం. దీని ద్వారా మానవుడు ప్రధాన ఆహారంలో పోషకాహారాన్ని పొందుతాడు. ఆవు దాని ఉత్పత్తులకు సంబంధించిన సామాజిక -ఆర్థిక అంశాలతో పాటు మతపరమైన.. సాంస్కృతిక ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని దేశీయ ఆవులను పెంచడానికి పశువుల పెంపకందారులను ప్రభుత్వం ప్రోత్సహించింది.
ముఖ్యంగా భారతదేశంలో ఆవుకు తల్లి హోదా ఇవ్వబడింది . హిందూ మతంలో పూజించబడుతున్న ఆవు పాలు, మూత్రం పేడను పవిత్రంగా భావించి సమృద్ధిగా ఉపయోగిస్తారు. ఆవు పాలు మానవ శరీరానికి చాలా మేలు చేస్తాయి.అయితే ఆవు మూత్రం అనేక వ్యాధులను నయం చేస్తుందని పేర్కొంది.